22 శ్లో॥ నాశయత్యేష వైభూతం తదేవసృజతి ప్రభుః|
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥
ప్రభుః = పరిపాలకుడైన
ఏషః = ఈ యాదిత్య దేవుడు
గభస్తిభిః = కిరణములచేత
భూతం = ప్ర్రాణికోటిని
నాశయతి = నశింప జేయుచున్నాడు (మరల)
తదేవ = ఆప్రాణికోటినే
సృజతి = సృష్టి చేయుచున్నాడు
పాయతి = రక్షించుచున్నాడు.
ఏషః = ఇతడు
తపతి = ఎండగాయు చున్నాడు.
ఏషః = ఇతడు
వర్షతి = వర్షించుచున్నాడు.
భావం :- ఈ సూర్యుడు ప్రాణి సమూహమునంతయు లయింప జేసి మరల ఆ ప్రాణి సముదాయమును సృజించుతాడు. అతడు తన వేడి కిరణాలతో మాడ్చివేసి శిక్షిస్తాడు. ఆ కిరణాలతో మరల చల్లని వర్షమును ప్రసాదించి రక్షిస్తాడు.
23. శ్లో॥ ఏషసుప్తేషు జాగర్తి | భూతేషు పరినిష్ఠితః।
ఏషఏవాగ్నిహోత్య్రంచ ఫలంచై వాగ్నిహోత్రిణాం॥
ఏషః = ఇతడు
భూతేషు = ప్ర్రాణులు
సుప్తేషునత్సు = నిదురించుచుండగా
జాగర్తి = మేలుకొనియుండును
అగ్నిహోతిరించ = త్రేతాగ్ని స్వరూపుడు గూడా
ఏషః = ఇతడే
అగ్నిహోత్రిణాం = అగ్నిహోత్రమును సృష్టించువారై దీక్షితులకు కలిగే
ఫలంచ = ఫలస్వరూపముగూడా
ఏషఏవ = ఇతడే
భావం :- మనము నిదురించు సమయమందుగూడ ఈ సూర్యుడు మనలో అంతర్యామియైయున్నందున సర్వకాల సర్వావస్ధలందును మన తోడుగవుండి రక్షించును. దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అను మూడగ్నులకు త్రేతాగ్నులని పేరు. అమూడింటిని నిత్యము సాయంకాల ప్రాతఃకాలము ఆరాధించుటకు అగ్నిహోత్రమని పేరు. ఆ స్వరూపము సూర్యుడే అంతమాత్రమేగాదు, దానిని శ్రద్ధగా ఆరాధించే యజమానుల దీక్షితులని పేరు. వారికి ఈలోకంలో సకల సంపదలు వచ్చునని స్వర్గం కూడ వచ్చుననియు, అదే అనుష్ఠానము నిష్కామంగా చేసే వారికి మోక్షం వస్తుందని వేదమాత యుపదేశించింది. ఈ చెప్పిన సకల ఫలముల స్వరూపం గా సూర్య భగవానుడే వున్నాడని భావము.
24. శ్లో ॥ వేదాశ్చక్రతవ శ్చైఎ| క్రతూనాం ఫలమేవచ।
యానికృత్యానిలోకేషుః సర్వఏషరవిః ప్రభుః ॥
వేదాశ్చ = వేదములును
క్రతవశ్చైవ = క్రతువులు కూడాను
క్రతూనాం = ఆక్రతువుల యొక్క
ఫలమేవచ = ఫలము గూడ
నః = అతడే
లోకేషు = పదునాలుగులోకములందను
యాని = ఏ, యే
కృత్యాని = పనులు గలవో
సర్వీః = అవన్నియు
ఏషః = ఈ
ప్రభుః = పరిపాలకుడైన
రవిః = సూర్యభగవానుడే
భావం :- ముందుశ్లోకంలో చెప్పిన అగ్నిహోత్రము దాని నాచరించినందున వచ్చేఫలమేగాక "యావజ్జీనమగ్ని హోత్రొంజుహుయాత్” జీవించియున్నంత వరకు అగ్నిని హోమం ద్వారా ఆరాధించ వలయును అనియు, అంతమాత్రమేగాక సృష్టిసంచాలనము ప్రవాహరూపంగా సాగి పోవుటకు మనకు గావలసిన ఇహపర సుఖముల నివ్వగల యజ్ఞములు ఆయజ్ఞములస్వరూపము, విధానము, ఫలము మొదలగు వానినిదెలిపే వేద ములు ఆయాగములను యధావిధిగా ఆనుష్ఠానం చేసినందు వలన ఆ సోమయాజులవారికిని లోకమునకును వచ్చేఫలములు మరియు లోకంలో నమస్త ప్రాణులు తమ తమ మనుగడకై జరుపుకొనే సకల కార్యములకు ఫలదాత ప్రభువైన ఈ సూర్యుడే. ఇంత వరకు సూర్యమహిమ మూడు శ్లోకములతో దెలిపిరి.